ఈ నెల 28న ‘విశాఖ ఉత్సవ్’: మంత్రి అవంతి

  • ‘విశాఖ ఉత్సవ్’ ను సీఎం జగన్ ప్రారంభిస్తారు
  • రెండు రోజుల పాటు ‘ఉత్సవ్’ నిర్వహిస్తాం
  • సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది
ఈ నెల 28న ‘విశాఖ ఉత్సవ్’ ను సీఎం జగన్ ప్రారంభించనున్నట్టు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అదే రోజున విశాఖలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు జగన్ శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. ‘విశాఖ ఉత్సవ్’కు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ‘విశాఖ ఉత్సవ్’ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతుందని వివరించారు.

రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవ్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పర్ఫార్మెన్స్, సినీ హీరోయిన్ తమన్నా లైవ్ పర్ఫార్మెన్స్, ‘ప్రతిరోజూ పండగే’ చిత్ర యూనిట్ పాల్గొంటుందని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. విశాఖ ఉత్సవ్ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలంగాణ, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసినట్టు చెప్పారు.
Go Back to Shorts
Visakhapatnam
Visakha Utsav
Minister
Avanthi

More Telugu News